రోప్ వేలో చిక్కుకున్న 25 మంది సేఫ్

రోప్ వేలో చిక్కుకున్న 25 మంది సేఫ్

మధ్యప్రదేశ్ సత్నాలో రోప్ వేలో చిక్కుకున్న 25 మంది ప్రయాణికుల్ని కాపాడారు అధికారులు. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. మైహర్ లోని త్రికూట్ కొండపైన దైవ దర్శనానికి వెళ్లేందుకు రోప్ వే ఎక్కారు పలువురు భక్తులు. రోప్ వే ఎక్కిన కొంత సేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. భక్తులు హడలిపోయారు. దీంతో గంటన్నరపాటు గాలిలోనే ఉండిపోయారు. తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరిచడంతో..సురక్షింతగా బయటపడ్డారు. తుఫాను విధ్వంసానికి చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు అధికారులు.