వచ్చేనెల నుంచి విదేశాలకు కరోనా వ్యాక్సిన్ల ఎగుమతి

వచ్చేనెల నుంచి విదేశాలకు కరోనా వ్యాక్సిన్ల ఎగుమతి

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల నుంచి విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాక మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా వెల్లడించారు. దేశీయ అవసరాలు చూస్తూనే.. మిగులు వ్యాక్సిన్లను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తామని ఆయన తెలిపారు. ముందుగా దేశీయ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని.. ఆ తర్వాతే అదనపు ఉత్పత్తిని విదేశాలకు పంపడం జరుగుతుందన్నారు. 30 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పలు పార్మా కంపెనీలతోపాటు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ కంపెనీల నుంచి కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ తయారీ ప్రారంభమౌతుందని ఆయన వివరించారు.