కాంగ్రెస్ లో చేరిన కన్హయ్య కుమార్‌, జిగ్నేశ్ మేవానీ

కాంగ్రెస్ లో చేరిన కన్హయ్య కుమార్‌, జిగ్నేశ్ మేవానీ

దేశ రాజకీయాల్లో తక్కువ సమయంలోనే ఎంతో పేరు పొందిన యువనేతలు కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ. ఆ ఇద్దరు నేతలు ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ పార్టీలో చేరారు. కన్హయ్య కుమార్ సీపీఐకి.. జిగ్నేశ్ మేవానీ రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కు గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కుమార్ ,జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

కన్హయ్య కుమార్ బీహార్ కు చెందిన నేత. విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక పోరాటాల్లో పాల్గొన్న కన్హయ్య బీహార్ లోని బెగుసరాయి ప్రాంతానికి చెందిన వ్యక్తి. గత ఎన్నికల సమయంలో CPIలో చేరిన ఆయన... బెగుసరాయి నుంచి లోక్ సభకు పోటీ చేసి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

జిగ్నేశ్ మేవానీ జాతీయస్థాయిలో దళితనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్ లోని వడ్ గాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కు కన్వీనర్ గా వ్యవహరించారు.