- దివ్యాంగురాలి హత్యకేసును ఛేదించిన శంషాబాద్ పోలీసులు
శంషాబాద్, వెలుగు: దివ్యాంగురాలి మర్డర్కేసును శంషాబాద్ పోలీసులు చేధించారు. బంధువులే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. మండలంలోని ఇంద్రానగర్ దొడ్డిలో నానాజీపూర్ యాదమ్మ(37) ఈనెల 8న హత్యకు గురైంది. ఈ కేసులో ఓ వ్యక్తిని అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతను హత్య చేయలేదని విచారణలో తేలింది. యాదమ్మ తమ్ముడి భార్య రాజేశ్వరికి, చెల్లెలి భర్త విజయ్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలియడంతో వారిని వద్దని వారించింది. దీంతో రాజేశ్వరి, విజయ్ కుమార్ కలిసి తమకు అడ్డుగా ఉందనే కారణంతో యాదమ్మను హత్య చేసి 5 తులాల బంగారం ఎత్తుకెళ్లి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.