పోలీస్ ​అన్నలు ఉన్నరని మర్చిపోవద్దు: ​ సీపీ సజ్జనార్​

పోలీస్ ​అన్నలు ఉన్నరని మర్చిపోవద్దు: ​ సీపీ సజ్జనార్​

రామచంద్రాపురం(జిన్నారం), వెలుగు: ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్​  అన్నలు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దని సైబరాబాద్ ​పోలీస్ ​కమిషనర్ ​సజ్జనార్ చెప్పారు.  సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలోని మెట్రోకెమ్​ ఏపీఎల్ కంపెనీలో బుధవారం విమెన్స్​డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సజ్జనార్​తోపాటు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి, షీ టీమ్స్​డీసీపీ అనసూయ అతిథులుగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళలు వ్యక్తి గతంగా, వృత్తి పరంగా రెండు రంగాలను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తున్నారని అభినందించారు. మెయిన్​గా ఫార్మా రంగంలో మహిళల కృషి గర్వించదగినదన్నారు. కరోనాను కంట్రోల్​ చేయడంలో మహిళల సేవలు మరువలేనివని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్​సీఎస్​పీ సెక్రటరీ జనరల్ కృష్ణ, ఉమెన్స్​ ఫోరం హెడ్ పద్మప్రియ, కంపెనీ సీఎండీ వెంకటేశ్వర్​రావు తదితరులు పాల్గొన్నారు.