రామచంద్రాపురం(జిన్నారం), వెలుగు: ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ అన్నలు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలోని మెట్రోకెమ్ ఏపీఎల్ కంపెనీలో బుధవారం విమెన్స్డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సజ్జనార్తోపాటు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, షీ టీమ్స్డీసీపీ అనసూయ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళలు వ్యక్తి గతంగా, వృత్తి పరంగా రెండు రంగాలను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారని అభినందించారు. మెయిన్గా ఫార్మా రంగంలో మహిళల కృషి గర్వించదగినదన్నారు. కరోనాను కంట్రోల్ చేయడంలో మహిళల సేవలు మరువలేనివని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్పీ సెక్రటరీ జనరల్ కృష్ణ, ఉమెన్స్ ఫోరం హెడ్ పద్మప్రియ, కంపెనీ సీఎండీ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.