పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాల్సిందే

పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాల్సిందే

ములుగు జిల్లా బొమ్మాయి గూడెంలో ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు ఎమ్మెల్యే సీతక్క. పోడు రైతుల భూముల్లో స్ట్రెంచ్ లు కొడుతున్నారని తెలిసి.. రైతులతో కలిసి అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా దున్నుకుంటున్న రైతుల భూములపై.. ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం మంచిది కాదన్నారు. రెవెన్యూ పట్టా ఉండి కోర్టు స్టే ఇచ్చినా.. ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇస్తే... టీఆర్ఎస్ సర్కార్ హరితహరం పేరుతో లాక్కుంటోందని ఆరోపించారు.అంతేకాదు.. పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్న సీతక్క.