దోపిడీకి వ్యతిరేకంగా ఏర్పడింది తెలంగాణ

దోపిడీకి వ్యతిరేకంగా ఏర్పడింది తెలంగాణ

తెలంగాణ భూముల అమ్మకం పై మంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలన్నారు. మరి.. ధనిక రాష్ట్రం అని  సీఎం కేసీఆర్ చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఎందుకని ప్రశ్నించారు. అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని... అని మీ సీఎం గారు ఒప్పుకుని ఇందుకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రజలు ఉద్యమాలకు తప్పక రెడీ అవుతారన్నారు. ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు..ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? ఉన్న జైళ్ళు కూల్చుడెందుకు? కోట్ల రూపాయల వృధా పబ్లిసిటీ ఖర్చులెందుకు? సెక్రెటేరియట్‌ కే రాని సీఎం గారికి కొత్త భవనాలెందుకు? అంటూ ప్రశ్నించారు విజయశాంతి.