మిజోరాంలో 106 మంది చిన్నారులకు కరోనా

మిజోరాంలో 106 మంది చిన్నారులకు కరోనా

మిజోరాంలో కరోనా  విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 520 మంది వైరస్ బారిన పడ్డారు. వారిలో 106 మంది చిన్నారులున్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 21,854కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 98కి చేరిందన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఐజ్వాల్ జిల్లా నుంచి 353, కొలాసిబ్‌ నుంచి 76, లుంగ్లీ నుంచి 50 మందికి వైరస్‌ సోకినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,730 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 18,026 మంది కోలుకున్నారు. మిజోరాం రాష్ట్ర వ్యాప్తంగా  సోమవారం నాటికి 5.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.