రూ.2కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌..3కార్లు సీజ్

రూ.2కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌..3కార్లు సీజ్

హైదరాబాద్ లో గంజాయి సరఫరా చేస్తున్న అంత‌రాష్ట్ర ముఠా గుట్టు ర‌ట్ట‌యింది.  రాచ‌కొండ ఎస్ వోటీ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం సమీపంలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు పోలీసులు.

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా,టాటా వాహనాలలో గంజాయి ని తరలిస్తుండగా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసామని..మరో ముగ్గురు పరారీలో ఉన్నారని  వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. ప్రధాన నిందితుడు షేక్ యాసిన్ అలియాస్ ఫీరోజ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ ఈ దందా చేస్తున్నట్లు  చెప్పారు. ప్రస్తుతం ఫిరోజ్ తో పాటు ఇద్దరు డ్రైవర్లు రవీందర్,మధు పరారీలో ఉన్నారు.నిందితుల దగ్గర  నుండి 3 వాహనాలు, నగదు 5 వేలు, మొబైల్స్ 2, ప్లాస్టిక్ బ్యాగ్స్ 6 సీజ్ చేసామన్నారు.  నిందితుల పైన NDPS యాక్ట్ తో పాటు పిడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు.