మేఘాలయలోని రింగ్ది నదిలో బస్సుపడి ఆరుగురు మృతి

మేఘాలయలోని రింగ్ది నదిలో బస్సుపడి ఆరుగురు మృతి

మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. తురా నుంచి షిల్లాంగ్‌ వెళ్తున్న బస్సు నోంగ్‌చ్రామ్‌ ప్రాంతంలోని రింగ్ది నదిలో ఒక్కసారిగా పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ఉన్నారు. బస్సులోని ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. నాలుగు మృతదేహాలను వెలికి తీయగా.. మరో రెండు మృతదేహాలు బస్సులోనే చిక్కుకొని ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న మృతదేహాలతో పాటు 16 మంది ప్రయాణికులను వెలికి తీసిన రెస్క్యూ టీం..చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో బస్ డ్రైవర్ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.