12 ఎమ్మెల్సీ స్థానాలకు 6 ఏకగ్రీవం

12 ఎమ్మెల్సీ స్థానాలకు 6 ఏకగ్రీవం

రాష్ట్రంలో  స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నిన్న( గురువారం) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగిసింది. మొత్తం 12 స్థానాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌గా.. ఇందులో 6 స్థానాలు ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. మ‌రో 6 స్థానాల‌కు డిసెంబ‌ర్ 10న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు ఎన్నికల అధికారులు. ఆదిలాబాద్ నుంచి దండె విఠ‌ల్, న‌ల్ల‌గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖ‌మ్మం నుంచి తాతా మ‌ధు, మెద‌క్ నుంచి డాక్ట‌ర్ వంటేరి యాద‌వ‌రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి భానుప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ బ‌రిలో ఉన్నారు.

నిజామాబాద్ నుంచి క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికైయ్యారు.  ఆదిలాబాద్‌, న‌ల్ల‌గొండ, మెద‌క్, ఖ‌మ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాల‌కు  డిసెంబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.