
దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో కోళ్లు మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే యూపీ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, గుజరాత్లలో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి.
ఇప్పుడు మహారాష్ట్రలోని పర్బణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో రెండు రోజుల్లో సుమారు 800 కోళ్లు మృతి చెందాయి. ఈ క్రమంలో కోళ్ల నమూనాలను అధికారులు ల్యాబ్కు పంపించారు. దీంతో ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని తెలిసిందని అధికారులు ప్రకటించారు. మురుంబా గ్రామంలోని ఎనిమిది ఫౌల్ట్రీఫామ్లలో కోళ్లు చనిపోయాయి. దీతో మిగిలిన కోళ్లన్నింటిని చంపేయనున్నట్లు అధికారులు తెలిపారు.