- టెర్రరిస్ట్ క్యాంప్లను తుడిచిపెట్టాం
- బాలాకోట్ ఆపరేషన్పై పైలెట్లు
- చివరి క్షణం వరకూ సీక్రెసీ పాటించాం
- అర్ధరాత్రి దాటాక మిరాజ్ ఫైటర్లతో గాల్లోకి..
ఆపరేషన్ బందర్. బాలాకోట్ ఎయిర్స్ట్రయిక్స్కు ఇండియన్ ఎయిర్ఫోర్స్ పెట్టిన కోడ్ నేమ్. బోర్డర్ దాటి వెళ్లి జైషే మహ్మద్ టెర్రరిస్టు సంస్థ క్యాంపులను కూల్చివేయడం ఈ మిషన్ టార్గెట్. ఈ ఆపరేషన్కు పట్టిన టైమ్ ఎంతో తెలుసా? 90 సెకన్లు. బాలాకోట్లో ఐఏఎఫ్ దాడి తొంభై క్షణాల్లో పూర్తయిందట. పుల్వామా టెర్రర్ అటాక్కు ప్రతీకారంగా చివరి క్షణం వరకూ సీక్రెట్ గా నడిచిన ఈ మిషన్.. ఎలాంటి అనుమానాలకూ చోటివ్వకుండా ఫినిష్ అయ్యిందట. పేర్లను బయటపెట్టొద్దనే షరతుతో బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్లో పాల్గొన్న పైలట్లు ఈ వివరాలను మీడియాకు మంగళవారం వెల్లడించారు.
న్యూఢిల్లీ: బాలాకోట్ లోని జైషే మహ్మద్ టెర్రర్క్యాంపులపై జరిపిన ఇండియన్ఎయిర్ఫోర్స్దాడి మొత్తం తొంభై క్షణాల్లో పూర్తయిందని ఈ ఆపరేషన్లో పాల్గొన్న పైలెట్లు వెల్లడించారు. చివరి క్షణం వరకూ అత్యంత సీక్రెట్ గా, ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా మిషన్పూర్తి చేసినట్లు చెప్పారు. తమ పేరు బయటపెట్టొద్దనే షరతుతో బాలాకోట్ఎయిర్స్ట్రైక్స్వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఈ ఆపరేషన్పకడ్బందీగా కొనసాగించినట్లు చెప్పారు. వేర్వేరు ఎయిర్ బేస్ల నుంచి బయలుదేరిన మన యుద్ధ విమానాలు చుట్టూ తిరిగి పాక్బోర్డర్దాటి బాలాకోట్వైపు దూసుకెళ్లడం, ముందే ఫిక్స్చేసిన టార్గెట్పై బాంబులు వేసి వెనక్కి తిరిగి వచ్చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..
పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ప్రతీకారం తప్పదని అందరికీ అర్థమైంది.. అయితే, ఏం జరగనుందనే విషయంలో ఎవరికీ క్లారిటీలేదు. ఎయిర్ఫోర్స్కార్యకలాపాలు రొటీన్గా జరిగిపోతున్నాయ్. ఉన్నతాధికారుల రొటీన్ డ్యూటీల్లోనూ ఎలాంటి మార్పులేదు. బోర్డర్లో గస్తీని అధికారులు పెంచారు. మిరాజ్జెట్లతో మేం కూడా గస్తీలో పాల్గొన్నాం. ఫిబ్రవరి 25 సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బేస్ స్టేషన్లో మిరాజ్ఫైటర్లకు స్పైస్2000 మిస్సైల్స్అమర్చారు. వాటిలో టార్గెట్అప్పటికే ఫీడ్చేశారు. అప్పటికీ దాడి చేయాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను మాకు పూర్తిగా చెప్పలేదు. అర్ధరాత్రి దాటింది.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మేం గాల్లోకి లేచాం.. మాకు రక్షణగా సుఖోయ్-30 ఎంకేఐ విమానాలు, గైడెన్స్కోసం అవాక్స్ విమానం, అవసరమైతే గాల్లోనే ఫ్యూయెల్ నింపేందుకు మరో ట్యాంకర్ విమానం కూడా మాతో వచ్చాయి.
టార్గెట్ వివరాలతో పాటు, ఏ రూట్లో ప్రయాణించాలి, ఎలా వెనక్కి రావాలనే విషయాలను ఉన్నతాధికారులు మాకు వివరంగా చెప్పారు. నిర్దేశించిన రూట్లో మా ప్రయాణం సాగింది. ఈలోగా పాక్బోర్డర్లో గస్తీ ఫైటర్ల సంఖ్యను మరింత పెంచారు. పాక్ ఎయిర్ఢిఫెన్స్ను గందరగోళంలోకి నెట్టడమే వాటి ఉద్దేశం.. సడెన్గా గస్తీ పెరగడంతో ఏదో జరగబోతోందని శత్రువు అనుమానిస్తాడు కానీ అదేంటనేది తెలియక అయోమయంలో పడతాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో బోర్డర్దాటి పని పూర్తిచేసుకురావాలని ప్లాన్.. అంతా అనుకున్నట్లుగానే జరిగింది.
సుదీర్ఘ రూట్ను ఎంచుకుని ప్రయాణించి, పాక్బోర్డర్దాటి బాలాకోట్జైషే క్యాంపుపై మిస్సైల్స్వదిలాం. పాక్తేరుకునేలోగా వెనక్కి తిరిగొచ్చాం. టెర్రర్క్యాంపు నామరూపాల్లేకుండా పోయింది. అయితే, ఈ దాడిలో కొన్ని చెట్లు తప్ప ఎలాంటి నష్టం జరగలేదని పాక్వాదించింది. ఈ ఆపరేషన్ మొత్తం రహస్యంగా జరిగింది. నేను ఇందులో పాల్గొంటున్నట్లు నా భార్యకు కూడా తెలియదు. తెల్లారి మీడియాలో చూసి ఇందులో మీరు పాల్గొన్నారా అని అడిగితే.. నేను జవాబివ్వకుండా నిద్రపోయాను.