
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అంతక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉనంన నిగంబోధ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగాయి. చితికి జైట్లీ కొడుకు రోహన్ అంతిమస్కారాలు చేశారు. కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరయ్యారు.