హైదరాబాద్ నిజాంపేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇటీవల గాయపడ్డ ఏఎస్సై మహిపాల్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(బుధవారం) మృతి చెందాడు. మూడు రోజుల క్రితం
నిజాంపేటలోని రాఘవ రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్య మత్తులో ఉన్న ఓ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో కారుతో ఏఎస్సై మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన ఏ ఎస్సై మహిపాల్ రెడ్డిని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చనిపోయాడు.