GHMC ఎన్నికల్లో రిగ్గింగ్‌ కోసమే బ్యాలెట్‌ పేపర్లు పెట్టారు

GHMC ఎన్నికల్లో రిగ్గింగ్‌ కోసమే బ్యాలెట్‌ పేపర్లు పెట్టారు

GHMC ఎన్నికల్లో రిగ్గింగ్‌ కోసమే బ్యాలెట్‌ పేపర్లు పెట్టారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మీడియాతో మాట్లాడిన ఆయన..గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని తక్కువ అంచనా వేసిన సీఎం కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు. ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచి, మేయర్‌ పీఠం సాధించేవాళ్లమని తెలిపారు. TRS అడ్డదారిలో వెళ్లి గెలిచేందుకు ప్రయత్నించి విఫలమైందన్నారు. DGP, ఎన్నికల సంఘం,MIM,TRS అందరూ ఒక్కటేనన్నారు బండి సంజయ్.

MIMకు బీజేపీ అడ్డుకునే స్థాయి లేదన్నారు బండి సంజయ్. హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తీరుమార్చుకోవాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రెండు డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు.కేంద్రం నిధుల విషయంలో హైదరాబాద్‌ అభివృద్దికి సహకరిస్తామన్నారు.

జానారెడ్డి బీజేపీలో చేరతారనే అంశంపై స్పందించిన బండి సంజయ్…. ఆయన నుంచి ఎలాంటి ఫోన్‌కాల్‌ రాలేదని… జానారెడ్డి, ఆయన తనయుడు వేర్వేరు కాదన్నారు. అంతేకాదు.. ఢిల్లీ పెద్దల సమక్షంలో సోమవారం విజయశాంతి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.