కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో ఎవరికీ అర్థం కాదు

కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో  ఎవరికీ అర్థం కాదు

తెలంగాణ రైతులకు న్యాయం చేసి.. తర్వాత బయటి రాష్ట్రం  రైతులకు న్యాయం చేయాలన్నారు బీజేపీ నేత విజయశాంతి. ప్రధాని అపాయింట్మెంట్ కావాలంటే ముందుగానే తీసుకోవాలన్నారు. అసలు కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాదన్నారు. అసలు కేసీఆర్ ను ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు విజయశాంతి. కేసీఆర్ రైతులకు ఏ విధంగా ద్రోహం చేశారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణలోని రైతులకు రుణమాఫీ చేయరు.. రైతులకు పరిహారం ఇవ్వరు కానీ..పంజాబ్ రైతులకు ఇస్తానంటే ఎవరూ నమ్ముతారని ప్రశ్నించారు.