టోల్ గేట్ వద్ద బీఎస్పీ కార్యకర్తల ఆందోళన

టోల్ గేట్ వద్ద బీఎస్పీ కార్యకర్తల ఆందోళన

శంషాబాద్, వెలుగు: వరంగల్​లో ఆదివారం నిర్వహించిన బీఎస్పీ బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివెళ్లారు. కాగా శంషాబాద్ ఓఆర్ఆర్ మీదుగా వెళ్లేందుకు డీసీఎంలో వచ్చిన కొందరు లీడర్లు, కార్యకర్తలు తొండుపల్లి టోల్​గేట్​ వద్ద టోల్​ చార్జ్​ మినహాయిపు ఇవ్వాలని కోరారు. అక్కడి సిబ్బంది అందుకు నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. బెంగళూరు నేషనల్ ​హైవేపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. తర్వాత టోల్ ​సిబ్బంది వారితో మాట్లాడి పంపించేశారు.