TSPSC తాత్కాలిక ఛైర్మన్‌గా సీహెచ్ సాయిలు

TSPSC తాత్కాలిక ఛైర్మన్‌గా సీహెచ్ సాయిలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) తాత్కాలిక ఛైర్మన్‌గా ఇవాళ(బుధవారం) సీహెచ్ సాయిలు నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం ఈనెల 18న ముగిసింది. TSPSC సభ్యుల్లో ప్రస్తుతం సాయిలు ఒక్కరే ఉన్నారు. సభ్యుడిగా సాయిలు పదవీకాలం నవంబరు 1వరకు ఉంది. పూర్తిస్థాయి ఛైర్మన్‌ను నియమించే వరకు.. లేదా సాయిలు పదవీకాలం ముగిసేవరకు ఆయన తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో తెలిపింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉత్తర్వుల క్రమంలో సాయిలు బుధవారం కమిషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.