అఖిలపక్షం ఆధ్వర్యంలో సమిష్టి పోరాటం

అఖిలపక్షం ఆధ్వర్యంలో సమిష్టి పోరాటం
  • భారత్ బంద్ ను జయప్రదం చేయాలి 
  • టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలపై 19పార్టీలతో కూడిన అఖిలపక్షం సమష్టి పోరాటానికి సిద్ధమవుతున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ వెల్లడించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మధుయాష్కీ పిలుపునిచ్చారు. శనివారం చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్ ఆధ్వర్యంలో భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూరూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను మధుయాష్కీ నివాసంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ ఈనెల 27న జరిగే భారత్ బంద్ లో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.