సెకండ్ వేవ్ లో ప్రజలను గాలికి వదిలేశారు

సెకండ్ వేవ్ లో ప్రజలను గాలికి వదిలేశారు

హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ విషయంపై శనివారం ఆయన ట్వీట్ చేశారు. సంక్షోభ సమయంలో సర్కార్ ప్రజలను గాలికి వదిలేసిందన్నారు. చికిత్స అందించే విషయం అటుంచితే, కనీసం కరోనా కేసులను లెక్కించడంలోనూ ఏమాత్రం జాగ్రత్త చూపలేదని.. ఈ క్రమంలో ఐసీఎంఆర్ సీరో సర్వే (మే నెల) రిపోర్టును షేర్ చేశారు. రోజువారీ రిపోర్టుల్లో పేర్కొంటున్న గణాంకాల కంటే క్షేత్రస్థాయిలో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోందని తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా కరోనా కేసులను లెక్కల్లో చూపలేదని ఆరోపించారు ఒవైసీ.