పేదలు గుడిసెలు వేసుకుంటే అక్రమ కేసులా?

పేదలు గుడిసెలు వేసుకుంటే అక్రమ కేసులా?

హుజురాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు స్కీం తీసుకొచ్చారని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. దళితుల అభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. మరోవైపు.. ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు చాడ. పోడు భూములకు పట్టాలివ్వాలనే డిమాండ్ తో పోడుయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. కుమ్రం భీం జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు ఆగస్టు 4 నుండి 8 తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన నర్సులు.. చాడను కలిసి వినతిపత్రం ఇచ్చారు.