రైతులకు సర్కార్ క్షమాపణలు చెప్పాలి

రైతులకు సర్కార్ క్షమాపణలు చెప్పాలి

గౌరెల్లి రైతులకు బేడీలు వేయడం సిగ్గు చేటు అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రైతన్నల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకురావడంపై సర్వత్రా నిరసనలు వ్యవక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌరెల్లి రైతులకు బేడీలు వేయడం సిగ్గు చేటు అన్నారు. రైతులకు సర్కార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేశారని నారాయణ మండిపడ్డారు. ఈ ఘటనపై మానవ హక్కులకు పిర్యాదు చేస్తామని తెలపారు. ప్రభుత్వం గిట్ల చేస్తే రైతులు భూములు కూడా ఇయ్యరని ఎద్దేవ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.