తమ రెస్టారెంట్ లోకి వచ్చేవారు..ముఖ్యంగా మహిళలు చీర ధరించి రాకూడదని నిబంధన విధించింది. అంతేకాదు..అర్హత నిబంధనల్లో చీర వస్త్రధారణను నిషేధించి వివాదంలో చిక్కుకుంది ఢిల్లీలోని ఓ ఖరీదైన రెస్టారెంట్. ఇప్పుడా రెస్టారెంట్ మూతపడింది. రెస్టారెంట్ సరైన వ్యాపార అనుమతులు పొందలేదని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిందంటూ ఈ నెల 24న దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆ రెస్టారెంట్ నడుస్తోందని ప్రజారోగ్య విభాగ ఇన్స్పెక్టర్ మూసివేత తాఖీదులో తెలిపారు.
ఈ క్రమంలో తాము రెస్టారెంట్ను ఈ నెల 27 నుంచి మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. వ్యాపార అనుమతులు పొందే వరకూ రెస్టారెంట్ను ప్రారంభించబోమని స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా రెస్టారెంట్లో తనకు అవమానం జరిగిందంటూ ఓ మహిళ ఆరోపించారు.