
నాగ్పూర్: 40 వేల కోట్ల కేంద్ర ఫండ్స్ను ‘దుర్వినియోగం’ కాకుండా చూడడానికే మెజార్టీలేకపోయినా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారని బీజేపీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే అనంత్కుమార్ కామెంట్స్లో ఏమాత్రం నిజంలేదని ఫడ్నీవీస్ సోమవారం కొట్టిపారేశారు. నిధులు కావాలని కేంద్రాన్ని కోరడంగాని, వాటిని సెంటర్కు మహారాష్ట్ర సర్కార్ తిరిగి పంపేయడంగాని జరగలేదని మహారాష్ట్ర మాజీ సీఎం సోమవారం క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధుల్ని ‘రక్షించడానికే’ గతనెల మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా జరిగిందని కాంట్రవర్షియల్ కామెంట్స్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే కేంద్రమాజీ మంత్రి అనంత్కుమార్ శనివారం నోరు జారారు.
“ మా పార్టీకి చెందిన నాయకుడు మహారాష్ట్రలో కేవలం 80 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మేం ఎందుకీ డ్రామాను చేయాల్సి వచ్చింది? మాకు తెలియదనుకున్నారా ? మెజారిటీ లేదని మాకు తెలిసినా.. ఆయన ఎందుకు సీఎం అయ్యారు? ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు ’’ అని ఆయన ఉత్తర కన్నడలోని యెల్లాపూర్ అసెంబ్లీ బైపోల్ఎన్నికల ప్రచార సభలో అన్నారు.
“ సీఎం కంట్రోల్లో 40 వేల కోట్లపైగా నిధులుంటాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ డబ్బును అభివృద్ధి పనుల కోసం కాకుండా వేరే పనులకు మళ్లించి దుర్వినియోగం చేసేది. అందుకే పక్కా ప్లాన్తో పెద్ద డ్రామాకు తెరతీశాం“అంటూ అనంత్కుమార్ కామెంట్స్ను ఫడ్నవీస్ తప్పుపట్టారు. హెగ్డే ఆరోపణల్లో నిజంలేదన్నారు. ‘‘రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. ఇలా జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు. స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ అంశంపై విచారణ జరిపి నిజాన్ని బయటకు తీయొచ్చు” అని ఫడ్నవీస్ వివరించారు.