ఫీజు కట్టలేదని  ఫెయిల్ చేసిన్రు

ఫీజు కట్టలేదని  ఫెయిల్ చేసిన్రు
  • న్యాయం చేయాలని మంత్రి సబితకు టీఎమ్మార్పీఎస్‌‌‌‌ వినతి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇంటర్‌‌‌‌ ఫస్టియర్‌‌‌‌, సెకండియర్‌‌‌‌లో ఫీజు కట్టలేదని సికింద్రాబాద్‌‌‌‌లోని సెయింట్ మెరీస్ కాలేజీ 80 మంది స్టూడెంట్లను ఫెయిల్‌‌‌‌ చేసిందని, వాళ్లకు న్యాయం చేయాలని టీఎమ్మార్పీఎస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ ఇటుక రాజు మాదిగ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్​లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. పరీక్ష ఫీజు కట్టలేదనే సాకుతో ఉద్దేశపూర్వకంగా ఫెయిల్‌‌‌‌ చేశారని, స్టూడెంట్ల పేర్లను ఇంటర్‌‌‌‌ బోర్డుకు పంపలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. వీరందరినీ పాస్‌‌‌‌ చేసి, న్యాయం చేయాలని కోరారు. స్టూడెంట్లు ఫెయిల్‌‌‌‌ కావడానికి కారణమైన కాలేజీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.