ఎన్టీఆర్ స్టేడియం గోమహాగర్జన సభలో అగ్నిప్రమాదం

ఎన్టీఆర్ స్టేడియం గోమహాగర్జన సభలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ ఎన్టీఆర్‌ స్టేడియంలో అగ్నిప్రమాదం జరిగింది. యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో మహాగర్జనలో ఈ ప్రమాదం జరిగింది.అగ్నిప్రమాదంలో వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనలో మూడు గుడారాలు కూడా కాలిపోయాయి. 

వెంటనే అలర్టైన  పోలీసులు, యుగతులసి సభ్యులు,వాలంటీర్లు వేదిక దగ్గరకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అందరూ అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాసేపట్లో సభ ప్రారంభం కానుండగా ఈ అగ్నిప్రమాదం జరగడంతో నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.