
- రా మెటీరియల్స్ రేట్లు పెరగడమే కారణం
- సఫోలా, పారాచూట్ పోర్ట్ఫోలియో రేట్లు పెంచుతున్నట్లు మారికో ప్రకటన
- వేచి చూస్తున్న పార్లే, డాబర్, పతంజలి
న్యూఢిల్లీ: రా మెటీరియల్స్ రేట్లు పెరుగుతుండటంతో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ ) కంపెనీలు తమ ప్రొడక్ట్స్రేట్లనూ పెంచాలని చూస్తున్నాయి. మారికో వంటి కొన్ని కంపెనీలు ఇప్పటికే రేట్లను పెంచగా, డాబర్, పార్లే, పతంజలి వంటి మరికొన్ని కంపెనీలు పెంచేందుకు సిచ్యుయేషన్ను గమనిస్తున్నాయి. కోకోనట్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్, పామ్ ఆయిల్ వంటి రా మెటీరియల్స్ రేట్లు పెరగడంతో, దానికనుగుణంగా తమ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ రేట్లను సవరించాలని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. రేట్లను పెంచకపోతే తమ ప్రాఫిటబులిటీ పడిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా ఎడిబుల్ ఆయిల్ రేట్లు బాగా పెరిగాయి. దీంతో మా మార్జిన్స్ పై ప్రభావం పడుతోంది. ఇప్పటిదాకా రేట్లు పెంచలేదు, కానీ రా మెటీరియల్స్ రేట్లు ఇలాగే పెరిగితే, మా ప్రొడక్ట్స్ రేట్లు పెంచకతప్పదని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మాయాంక్ షా చెప్పారు. కమోడిటీస్ రేట్లు ఒక దశలో పెరగడం, ఆ తర్వాత మళ్లీ తగ్గడం (అంటే సైక్లికల్) సాధారణమేనని అన్నారు. ఎడిబుల్ ఆయిల్ వాడే అన్ని ప్రొడక్ట్స్ రేట్లనూ పెంచాల్సి ఉంటుందని, పెంపుదల కనీసం 4 నుంచి 5 శాతం దాకా ఉంటుందని షా చెప్పారు. ఆమ్లా, గోల్డ్ వంటి రా మెటీరియల్స్ రేట్లు ఇటీవల బాగా పెరిగాయని డాబర్ ఇండియా సీఎఫ్ఓ లలిత్ మాలిక్ తెలిపారు. ఫ్యూచర్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నాం. వీలైనంత వరకూ దీనిని కస్టమర్లపై వేయకూడదనే అనుకుంటున్నామని మాలిక్ పేర్కొన్నారు. కాకపోతే, తప్పనిసరయిన కొన్ని ప్రొడక్ట్స్ రేట్లు మాత్రం పెరగొచ్చని వెల్లడించారు. మార్కెట్లో పోటీనీ దృష్టిలో ఉంచుకునే రేట్ల పెంపుదల ఉంటుందని చెప్పారు.
రేట్లు పెంచక తప్పదంటున్న కంపెనీలు
ప్రొడక్ట్స్ రేట్లను పెంచే విషయంలో పతంజలి ఆయుర్వేద ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కాకపోతే, ఆ దిశలో ఆలోచిస్తున్నట్లు మాత్రం సంకేతాలిస్తోంది. చాలా వరకు రా మెటీరియల్స్రేట్ల పెరుగుదలను కస్టమర్లపై వేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తామని, తప్పనిసరయితేనే రేట్ల పెంపుదల విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని పతంజలి స్పోక్స్ పర్సన్ ఎస్ కే తిజారావాలా తెలిపారు. సఫోలా, పారాచూట్ వంటి బ్రాండ్ల సొంతదారు మారికో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రొడక్ట్స్పై రేట్లను పెంచింది. కొన్ని ప్రమోషన్స్నూ మానుకున్నామని, పారాచూట్, సఫోలా ఎడిబుల్ ఆయిల్ పోర్ట్ఫోలియోస్ రేట్లను పెంచడం గత క్వార్టర్లోనే తప్పనిసరయిందని మారికో రిజల్ట్స్ సందర్భంగా గత వారంలో వెల్లడించింది. పామ్ ఆయిల్, టీ, కోప్రా, ఎడిబుల్ ఆయిల్స్ వంటి చాలా రా మెటీరియల్స్ రేట్లు పెరిగాయని ఎడిల్వీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ చెప్పారు. గ్రాస్ మార్జిన్స్పై ప్రభావం పడుతుండటంతో 2021లో రేట్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. రేట్ల నిర్ణయం విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు పవర్ ఎక్కువని, ఒకేసారి అవి రేట్లను పెంచవని, క్రమంగా పెంచుకుంటూ వెళ్లగలవని పేర్కొన్నారు. అగ్రి ఇన్పుట్స్ రేట్లు పెరగడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు మార్జిన్స్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయని, అయితే కస్టమర్లపై ఈ బరువును ఇప్పుడే మోపకపోవచ్చని ఈవై పార్ట్నర్ (కన్స్యూమర్ అండ్ రిటెయిల్) పినాకరంజన్ మిశ్రా అభిప్రాయపడ్డారు.