ఈటల.. అప్పుడు నీ ఆత్మాభిమానం ఎక్కడ పోయింది?

ఈటల.. అప్పుడు నీ ఆత్మాభిమానం ఎక్కడ పోయింది?

10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు రైతు బంధు వర్తించకుండా చూడాలని గతంలో క్యాబినెట్ సమావేశంలో సూచించానన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. సీఎం కేసీఆర్ త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈటల బీజేపీలో చేరారని విమర్శించారు. ఇప్పటివరకు 26 లక్షల రూపాయల రైతుబంధు తీసుకున్నప్పుడు ఆత్మాభిమానం ఎక్కడ పోయిందని ఆయన్ను ప్రశ్నించారు. ఫ్యూడల్ వ్యవస్థకు ఈటల ప్రతినిధిగా మారాడని ఆరోపించారు కడియం. రాష్ట్రంలో బీజేపీకి సంస్థాగత నిర్మాణం లేదని చెప్పారు.