అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్బండ్లోని ఆయన విగ్రహానికి గద్దర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 25 శాతం అమలు చేసినా కూడా ఈపాటికి దేశంలో అంటరానితనం పోయేది. ఇకనుంచి నా పేరును గద్దర్ అన్టచ్బిలిటీ అని పెట్టుకుంటున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ పనిచేశారు. అంబేద్కర్ ఆశయంతో అందరం ముందుకు వెళ్లాలి’ అని గద్దర్ అన్నారు.