మంత్రుల ఫ్లెక్సీలకు GHMC ఫైన్

మంత్రుల ఫ్లెక్సీలకు GHMC ఫైన్

హైదరాబాద్ సిటీలో నిబంధనలకు విరుద్ధం గా ఏర్పాటు చేసిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీ లకు GHMC లోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఫైన్ లు విధించింది. మెయిన్ సెంటర్లలో మంత్రుల ఫ్లెక్సీలను ఏర్పాటు  చేసినా మొదట పట్టించుకోలేదు అధికారులు. దీంతో సామాన్య జనాలకే ఫైన్ లు వేస్తారా,లీడర్స్ కు,మంత్రులకు రూల్స్ వర్తించవా అంటూ ట్విట్టర్ లో నెటిజన్లు అధికారులను నిలదీస్తూ ట్వీట్లు చేశారు. అవి కాస్తా వైరల్ కావడంతో..అలర్టైన  GHMC లోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఫైన్ లు వేశారు. 85,000 వేల రూపాయల ఫైన్ ను ఫిషరీస్ డిపార్ట్మెంట్ పేరుపై ఫైన్ విధించారు అధికారులు.