ఆగస్టు 2 వరకు గోవాలో కర్ఫ్యూ పొడిగింపు

ఆగస్టు 2 వరకు గోవాలో కర్ఫ్యూ పొడిగింపు

గోవాలో కర్ఫ్యూను ఆగస్టు 2 వరకూ పొడిగిస్తున్నట్టు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ(సోమవారం) గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు తెలిపారు. అయితే కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. మెడికల్ షాపులకు, మెడికల్ సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు మినహాయింపునిచ్చారు. అలాగే 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరిచేందుకు, ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ స్టేడియంలు నిర్వహించేందుకు అనుమతించారు. కాగా గోవాలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు.