కరోనా రిస్క్ ను తగ్గించే హెల్త్‌ ఏటీఎంలు

కరోనా రిస్క్ ను తగ్గించే హెల్త్‌  ఏటీఎంలు

హైదరాబాద్‌ కేంద్రంగా హెల్త్‌కేర్‌ స్టార్టప్‌  హీల్ఫా  తమ వర్ట్యువల్‌ క్లీనిక్‌ను హెల్త్‌ ఏటీఎంను  ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.  ఈ హెల్త్‌ ఏటీఎంలు  కోవిడ్‌ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించడంతో  పాటు నగర, గ్రామీణ ప్రాంతాలలో భారీ సంఖ్యలో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా  వర్ట్యువల్‌  క్లీనిక్స్‌ ద్వారా సహాయపడనున్నాయి. నివారణ, నిర్వహణ, చికిత్స పరంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో విజయవంతమైన హీల్ఫా , కోవిడ్‌ అత్యవసర పరిస్థితులలో వేలాది కుటుంబాలకు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు విజయవంతంగా చికిత్సనందించింది. ఇప్పుడు అదే తరహా ప్రయోజనాలను దేశవ్యాప్తంగా  తమ పాకెట్‌ క్లీనిక్‌ శక్తివంతమైన హెల్త్‌ ఏటీఎంల ద్వారా కోవిడ్‌తో  పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలకూ చికిత్సనందిస్తూ ఆ  ప్రయోజనాన్ని అందించడం లక్ష్యంగా చేసుకుంది.

ఈ సందర్బంగా హీల్ఫా ఫౌండర్‌ రాజ్‌ జనపరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ 2019లో 11శాతం టెలిమెడిసన్‌ వినియోగిస్తే ఇప్పుడు దాదాపు 76శాతం మంది వినియోగదారులు టెలిమెడిసన్‌ వినియోగపు సౌకర్యం అనుభవిస్తున్నారు. మా హెల్త్‌ ఏటీఎంలు ఇప్పుడు టెలి చికిత్సను మరో దశకు తీసుకువెళ్తున్నాయి. దీనిలో భాగంగా డాక్టర్లు  ఎక్కడి నుంచైనా  రోగి యొక్క ఆక్సిజన్‌ శాచురేషన్‌, రక్తపోటు, గ్లూకోజ్‌ స్ధాయిలతో పాటుగా ఈసీజీ కూడా పరిశీలించగలరు.  హెల్త్‌ ఏటీఏంలను గురించి సరిగ్గా చెప్పాలంటే ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచి అయినా, అందుబాటుధరలలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి. దీనిని పక్కనే ఉన్న మెడికల్‌ స్టోర్లు, పాఠశాలలు, కార్పోరేట్‌ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఆఖరకు పడవలలో సైతం ఏర్పాటుచేసి మారుమూల ప్రాంతలను సైతం చేరుకోవచ్చు. ఇది కేవలం నాలుగు చదరపు అడుగుల స్థలం మాత్రమే తీసుకుంటుంది. దేశంలో రోగి–డాక్టర్‌ రేషియో సమతుల్యతకు సైతం ఇది తోడ్పడనుంది’’ అని జనపరెడ్డి అన్నారు.హీల్ఫాను అత్యంత సౌకర్యవంతంగా వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌  చేయవచ్చు. ఇది ప్రభావవంతమైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన సంరక్షణను అందిస్తుంది.