ఆమె మరణ వార్త విని షాక్ కు గురయ్యాను: బాలకృష్ణ

ఆమె మరణ వార్త విని షాక్ కు గురయ్యాను: బాలకృష్ణ

సీనియర్ నటి గీతాంజలి మరణంపై పలువురు నటులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తొలితరం సీతగా,  తెలుగు హాస్య ప్రధాన చిత్రాల్లో ముఖ్య నాయికగా ప్రేక్షకులను అలరించారని ఆమెను గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు.

గీతాంజలి మరణంపై అగ్రహీరో బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. గీతాంజలి గారు పరమపదించారనే వార్త తెలియగానే షాక్ అయ్యానని ఆయన తెలిపారు. ’ఎప్పుడు కలిసినా అప్యాయంగా పలకరించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్నవారిలో ఆమె ఒకరు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరెక్ట్ చేసిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో సీత పాత్రలో గీతాంజలి గారు నటించారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్ స్పిరేషన్ గా తీసుకునే వారు.  ఆమ మరణం ఎంతో బాధాకరం, ఆమె ఆత్మకు శాంతి కలగాలి, ఆమె కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని  బాలకృష్ణ తెలిపారు.

Hero Balakrishna expresses condolences on Geetanjali's death