
జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA )కేన్సర్ రోగులు వాడే మందుల ధరలను భారీగా తగ్గించింది. దీనికి సంబంధించి సోమవారం ధరల్ని ప్రకటించింది. ముఖ్యంగా కీమోథెరపీ చికిత్సకు సంబంధించిన 9రకాల మెడిసిన్ రేట్లు బాగా తగ్గాయి. ఊపిరితిత్తుల కేన్సర్ కోసం వాడే పెమెక్స్ (500MG) ధర ప్రస్తుతం రూ. 22వేలు ఉండగా రూ.2800కు తగ్గింది. ఇదే డ్రగ్ 100MG ధర రూ.7700 ఉండగా అది రూ.800కు తగ్గింది. ఎర్లోటినిబ్ 100MG ట్యాబ్లెట్స్ ధర రూ.6600 నుంచి రూ.1840కి తగ్గించారు. ఎపిక్లోర్ 10MG ఇంజక్షన్ ధర రూ.561నుంచి రూ.276కు, 50MG ధర రూ.2662 నుంచి రూ.960కి తగ్గింది.