హైదరాబాద్ ఎమ్మెల్సీ మూడో రౌండ్ పూర్తి

హైదరాబాద్  ఎమ్మెల్సీ మూడో రౌండ్ పూర్తి

హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రకియ కొనసాగుతోంది.  మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రౌండ్ పూర్తి అయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీ వాణి ముందంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్‌లో ఆమె 4 వేల 444 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్‌కు మొత్తం 53,007  ఓట్లు వచ్చాయి. బీజేపీకి 48, 563 ఓట్లు, కాంగ్రెస్‌కి‌ 15,035, ప్రొ.నాగేశ్వర్‌‌కు 25, 505 ఓట్లు వచ్చాయి. మూడు రౌండ్లలో మొత్తం 10,082 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.