భార్య వేధింపులు బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య

భార్య వేధింపులు బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య

భార్య వేధింపులు తట్టుకోలేక ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని కూల్ డ్రింక్ లో పురుగులు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే సంతోష్ 2013 లో పాత బస్తీ కి చెందిన కళ్యాణి అనే మహిళ తో వివాహం చేసుకున్నాడు. సంతోష్ కొడుకు అభిరామ్ కు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాద పడుతున్నట్లు సమాచారం. అయితే అప్పటి నుండి భర్త సంతోష్ ను  భార్య వేధింపులకు గురిచేసినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనపై మూడుసార్లు హత్యాయత్నం కూడా చేశారన్నారు. కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. దీంతో భార్య పెట్టే టార్చర్ భరించలేక  ఆన్ లైన్ లో పురుగులు మందు ఆర్డర్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతోష్ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గోల్కొండ పోలీసులు.