ఫిబ్రవరి 28 వరకు ఫ్లైట్లు బంద్: డీజీసీఏ

ఫిబ్రవరి 28 వరకు ఫ్లైట్లు బంద్: డీజీసీఏ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతున్నందున ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి నెలాఖరు వరకు ఉన్న బ్యాన్​ను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు ఏవియేషన్ రెగ్యులేటరీ సంస్థ డైరెక్టరేట్‌‌ జనరల్‌‌ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ‘‘అన్ని ఇంటర్నేషనల్ కమర్షియల్ పాసింజర్ ఫ్లైట్‌‌ సర్వీసులను 2022, ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు నిలిపేస్తున్నాం’’ అని బుధవారం రిలీజ్ చేసిన సర్క్యులర్‌‌‌‌లో పేర్కొంది. కేంద్రం ఎయిర్ బబుల్‌‌ ప్రొటెక్షన్‌‌లో నడుపుతున్న స్పెషల్ ఫ్లైట్లు, అన్ని ఇంటర్నేషనల్ కార్గో ఫ్లైట్లకు వీటి నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. 2021, జులై 20వ తేదీ నుంచి 40 దేశాలకు స్పెషల్ పాసింజర్ ఫ్లైట్లను మన దేశం నడుపుతోంది.