ఫోన్ కొనియ్యలేదని ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఫోన్ కొనియ్యలేదని ఇంటర్ విద్యార్థిని సూసైడ్

మహబూబాబాద్: తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనియ్యలేదనే మనస్తాపంతో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లి గ్రామంలో జరిగింది. కొత్తగూడ ఎస్ ఐ సురేష్ కథనం  ప్రకారం ఎదుల్లపల్లి గ్రామానికి చెందిన కూస సంపత్ రెండవ కూతురు కూస త్రిష (16) ఇటీవల పదవ తరగతి పాస్ అయింది. ఆన్ లైన్ క్లాసులు ఉన్నాయని స్మార్ట్ ఫోన్ కొనివ్వమని తండ్రిని కోరింది. అయితే తండ్రి తన వద్ద అంత డబ్బులు ఇప్పుడు లేవు, మరి కొద్ది రోజులు ఆగమంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. 
ఎప్పుడు అడిగినా ఇలాగే చెబుతున్నావంటూ మనస్తాపం చెంది క్షణికావేశంలో పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు గుర్తించి నర్సంపేట ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా మంగళవారం చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరకు కొత్తగూడ ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.