వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌టం అనేది ఎంతో బాధాక‌రం

వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌టం అనేది ఎంతో బాధాక‌రం

వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన విధానం కాదన్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి గురించి పలువురు వ్యక్తిగత విమర్శలు చేయడంపై ట్విట్టర్లో స్పందించారు కళ్యాణ్ రామ్.‘అసెంబ్లీ అనేది ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించి వాటి ప‌రిష్కారం కోసం పాటు ప‌డే దేవాలయం వంటిది. అక్క‌డ చాలా మంది మేధావులు, చ‌దువుకున్న‌వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్ర‌దేశంలో రాజ‌కీయాల‌కు సంబంధం లేని వ్య‌క్తి గురించి వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌టం అనేది ఎంతో బాధాక‌రం. ఇది స‌రైన విధానం కాదు. సాటి వ్య‌క్తిని, ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను గౌర‌వించే మ‌న సంప్ర‌దాయంలో  మ‌హిళ‌ల‌ను అసెంబ్లీలో అకార‌ణంగా దూషించే ప‌రిస్థితి ఎదురుకావ‌డం దుర‌దృష్ట‌క‌రం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను’.అని అన్నారు.