కొత్త సీఎం ఎంపిక కోసం కర్ణాటకకు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్

కొత్త సీఎం ఎంపిక కోసం కర్ణాటకకు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్

కర్ణాటక కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త సీఎం ఎంపిక బాధ్యతను ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, కర్ణాటక బీజేపీ ఇంచార్జ్ అరుణ్ సింగ్ కు అప్పగించింది అధిష్టానం. ఇప్పటికే ధర్మేంద్ర ప్రదాన్ బెంగళూరు చేరుకోగా..కిషన్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు  కర్ణాటక బీజేపీ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో యడ్డీ వారసున్ని నిర్లయించనున్నారు. కర్ణాటక సీఎం పదవికి నిన్న యడ్యూరప్ప రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఎంపిక జరగనుంది. కేబినెట్ లో కూడా మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. సీఎం రేసులో MTB నాగరాజ్, సిటి రవి, ప్రహ్లాద్ జోషి పేర్లు వినిపిస్తున్నాయి.