మోడీ ప్రోగ్రాంకు కేసీఆర్​ పోవట్లే!

మోడీ ప్రోగ్రాంకు కేసీఆర్​ పోవట్లే!
  • 26న హైదరాబాద్​లో ఐఎస్​బీ స్నాతకోత్సవం.
  • హాజరుకానున్న ప్రధాని
  • సీఎంను ఆహ్వానించినా.. ఆయన అందుబాటులో లేరని ప్రభుత్వం చెప్పిందన్న ఐఎస్​బీ డీన్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనే ఐఎస్​బీ (ISB) స్నాతకోత్సవానికి సీఎం కేసీఆర్​ వెళ్లడం లేదు. గత కొంతకాలంగా వరుసగా మోడీ కార్యక్రమాలకు కేసీఆర్​ దూరంగా ఉంటున్నారు. ఫిబ్రవరిలో ముచ్చింతల్​లో జరిగిన ‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని రాగా.. సీఎం వెళ్లలేదు. ప్రధాని అధ్యక్షతన జరిగే ముఖ్యమంత్రుల సమావేశాలకు కూడా కేసీఆర్​ హాజరుకావడం లేదు. ఈ నెల 26న హైదరాబాద్​లో జరిగే ఇండియన్​ స్కూల్​ ఆఫ్​బిజినెస్​ (ఐఎస్​బీ) స్నాతకోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారని ఐఎస్​బీ ప్రకటించింది. ‘‘మేము సీఎం కేసీఆర్​తోపాటు మంత్రులను కూడా ఆహ్వానించాం. సీఎం అందుబాటులో లేరని, వేడుకలకు సీనియర్​ మంత్రిని పంపిస్తామని ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది” అని  ఐఎస్​బీ డీన్​ పిల్లుట్ల మదన్​ సోమవారం మీడియాకు తెలిపారు. అయితే.. ముందు ఖరారైన షెడ్యూల్​ ప్రకారం సీఎం కేసీఆర్​ఈ నెల 26న ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉన్నా.. అది రద్దు చేసుకొని సోమవారం రాత్రే హైదరాబాద్​కు బయలుదేరారు. 

మరిన్ని వార్తల కోసం : -

హైదరాబాద్కు బయలుదేరిన సీఎం కేసీఆర్


త్రిముఖ వ్యూహంతో పోరుకు సై