- 26న హైదరాబాద్లో ఐఎస్బీ స్నాతకోత్సవం.
- హాజరుకానున్న ప్రధాని
- సీఎంను ఆహ్వానించినా.. ఆయన అందుబాటులో లేరని ప్రభుత్వం చెప్పిందన్న ఐఎస్బీ డీన్
హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనే ఐఎస్బీ (ISB) స్నాతకోత్సవానికి సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు. గత కొంతకాలంగా వరుసగా మోడీ కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఫిబ్రవరిలో ముచ్చింతల్లో జరిగిన ‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని రాగా.. సీఎం వెళ్లలేదు. ప్రధాని అధ్యక్షతన జరిగే ముఖ్యమంత్రుల సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరుకావడం లేదు. ఈ నెల 26న హైదరాబాద్లో జరిగే ఇండియన్ స్కూల్ ఆఫ్బిజినెస్ (ఐఎస్బీ) స్నాతకోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారని ఐఎస్బీ ప్రకటించింది. ‘‘మేము సీఎం కేసీఆర్తోపాటు మంత్రులను కూడా ఆహ్వానించాం. సీఎం అందుబాటులో లేరని, వేడుకలకు సీనియర్ మంత్రిని పంపిస్తామని ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది” అని ఐఎస్బీ డీన్ పిల్లుట్ల మదన్ సోమవారం మీడియాకు తెలిపారు. అయితే.. ముందు ఖరారైన షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ఈ నెల 26న ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉన్నా.. అది రద్దు చేసుకొని సోమవారం రాత్రే హైదరాబాద్కు బయలుదేరారు.
మరిన్ని వార్తల కోసం : -
హైదరాబాద్కు బయలుదేరిన సీఎం కేసీఆర్
త్రిముఖ వ్యూహంతో పోరుకు సై