కుమ్రం భీం జిల్లాలో రోడ్డుపై పెద్దపులి

కుమ్రం భీం జిల్లాలో రోడ్డుపై  పెద్దపులి

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది.  పెంచికల్ పేట్ మండలం కమ్మర్గాం, మోర్లిగూడ గ్రామాల మద్యలో ప్రధాన రహదారిపై పెద్దపులి తిరుగుతుండడంతో... అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కమ్మర్గాం, మోర్లిగూడలను కలిపే రోడ్డుపై పెద్దపులి తిరుగుతోంది. గత 20 రోజుల్లో రెండు, మూడు సార్లు పెద్దపులి రోడ్లపైకి రావడంతో... జనం వణికిపోతున్నారు. రోడ్డు మీదకు పులి రావడంపై అటువైపు వెళ్తున్నవారు పరుగులు తీశారు. కొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. గతవారం మోర్లిగూడ గ్రామంలో రెండు ఎద్దులను చంపేసింది పులి. దీంతో రోడ్డుపైకి రావాలంటేనే జనం గజగజా వణుకుతున్నారు.