
అయోధ్య రామ మందిర్ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. అయోధ్యలో నిర్మించే రామాలయానికి చందాలివ్వొద్దని చెప్పారు. బీజేపీ నేతలు అయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారన్నారు. జగిత్యాలలో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీ సభలో ఈ విధంగా మాట్లాడారు. మన గ్రామాల్లో రాముడు లేడా… ఉత్తర ప్రదేశ్ లో రామాలయానికి చందాలెందుకు ఇవ్వాలని కామెంట్ చేశారు. బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులా.. తాము కూడా శ్రీరాముని భక్తులమే అన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్.