తిరుగుబాటు స్వరం.. ఈటెలను క్యాంఫ్ ఆఫీస్ కు తీసుకెళ్లిన కేటీఆర్

తిరుగుబాటు స్వరం.. ఈటెలను క్యాంఫ్ ఆఫీస్ కు తీసుకెళ్లిన కేటీఆర్

మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం  టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారడంతో   క్యాంప్ ఆఫీస్ లో  ఈటలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ (22న)మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. మంత్రి ఈటల రాజేందర్ ను.. తన కారులో తీసుకుని క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత.. క్యాంప్ ఆఫీస్ లో.. సీఎం కేసీఆర్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెగ్మెంట్ వీణవంకలో మంత్రి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. పరిగి ఏరుకుంటే రాదు పంట వేస్తేనే వస్తదని.. కల్యాణ లక్ష్మీ, పింఛన్లతో పేదరికం పోదన్నారు. సర్కారుపై ఈటల వ్యతిరేక స్వరం వినిపించడంతో  కేసీఆర్  భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.