ఎమ్మెల్యే రాములు నాయక్
కారేపల్లి, వెలుగు: త్వరలోనే రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కాబోతున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్పార్టీ ఆఫీస్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రతిపక్షం లేదని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్నాయకుల్లోనే స్వల్ప విబేధాలున్నాయని చెప్పారు. గ్రామ స్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటుచేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్ఎంపీపీ రావురి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్దుగ్గినేని సత్యనారాయణ పాల్గొన్నారు.
కేటీఆర్ సీఎం కావాలె: ఎమ్మెల్యే షకీల్
బోధన్, వెలుగు: వచ్చే శాసనసభ సమావేశాల్లో సీఎంగా కేటీఆర్ఉండాలన్నది తన అభిప్రాయమని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.