యుద్ధవిమానం ఏదైనా.. ఆమె అత్యంత చాకచక్యంగా నడిపించి శెభాష్ అనిపించుకోగలదు. మిగ్ -21 విమానాన్ని సోలోగా నడిపేస్తుంది. ఆమే ఇండియన్ ఆర్మీకి చెందిన యుద్ధ విమాన పైలట్ లెఫ్టినెంట్ భావనా కాంత్. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో వైమానిక దళ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయబోతోంది. తొలి మహిళా యుద్ధ విమాన పైలట్గా రికార్డుకెక్కిన ఈమె గురించి మరిన్ని విషయాలు.
ఈ జనరేషన్ అమ్మాయిలు రొటీన్గా ఉండడం ఇష్టపడడంలేదు. ఛాలెంజింగ్గా ఉండే ప్రొఫెషన్నే సెలక్ట్ చేసుకుంటున్నారు. భావనా కాంత్ కూడా అంతే. 2014లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఓ ఎమ్ ఎన్ సి కంపెనీలో చేరింది. అయితే ఆమె అక్కడే సెటిల్ అవ్వాలని అనుకోలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావాలనే తన చిన్ననాటి కలను నిజం చేసుకోవాలనుకుంది. ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎయిర్ ఫోర్స్ లోకి అడుగుపెట్టింది.
ఒకేసారి ముగ్గురు..
2016లో ఒకేసారి ఎయిర్ ఫోర్స్లోకి పైలట్లుగా ముగ్గురు అమ్మాయిలు చేరారు. ఆ ముగ్గురిలో భావనా కాంత్ ఒకరు. అయితే మిగతా ఇద్దరి కంటే ముందు యుద్ధ పోరాటాల్లో పొల్గొనే ఛాన్స్ భావనా కాంత్ దక్కించుకుంది. మిగ్ విమానాలు నడిపిన మొదటిమహిళగా రికార్డ్ సాధించింది.
అన్నింట్లో టాప్
ఫైటర్ పైలట్ అవడమంటే మాటలు కాదు. ఎన్నో దశల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ముందుగా ఫైటర్ జెట్స్ నడపడంలో ట్రైనింగ్ ఇస్తారు. యుద్ధాలు జరిగేటప్పుడు ఎలా విమానాన్ని నడపాలి. వెపన్స్ని ఎలా ఉపయోగించాలన్నది ఆ ట్రైనింగ్ లో ఉంటుంది. ఆ తర్వాత డే ఆప్స్ లో ఫైటర్ జెట్ నడిపే ట్రైనింగ్ ఇస్తారు. అంటే యుద్ధం పగటిపూట జరుగుతుంటే విమానాన్నిఎలా నడపాలి, శత్రువులతో ఎలా పోరాడాలనే టెక్నిక్స్ నేర్పిస్తారు. ఇది పూర్తయితేనే డే ఆప్స్ లో జరిగే ఆపరేషన్ లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇస్తారు. ఇవన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది భావనా కాంత్. రాజస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఫ్రంట్ లైన్ బేస్ లో 3-స్క్వాడ్రన్ లో మిగ్-21 బైసన్ ఫైటర్ పైలట్ గా ట్రైనింగ్ పూర్తిచేసి సెకండ్ స్టేజ్ కి వెళ్లింది. ఒంటరిగా యుద్ధ విమానాన్ని (ఫైటర్ జెట్) నడిపే పైలట్ అయ్యింది.
మిడిల్ క్లాస్ అమ్మాయి
భావనా కాంత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. తండ్రి నారాయణ్ కాంత్, తల్లి రాధా కాంత్. తండ్రి ఇంజనీర్. బీహార్లోని దర్భాంగలో పుట్టి పెరిగిన భావనకు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలనేది కల. కానీ, కోకో, బ్యాడ్మింటన్ ఆటలు బాగా ఆడుతుండడంతో ‘ప్లేయర్ అవ్వమని’ అందరూ సలహా ఇచ్చేవాళ్లు. కానీ, అవన్నీ తన హాబీలు మాత్రమేనని తన లక్ష్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ కావడమని కచ్చితంగా చెప్పేది. ఆమె కలలు కన్నట్లుగా ప్రస్తుతం భావన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు నడుపుతోంది.
మిగ్ 21 బైసన్ స్క్వాడ్రన్ తో ఆకాశంలో చక్కర్లు కొడుతోంది. 2020, మార్చి9న ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆమె ‘నారీ శక్తి పురస్కార్’ అవార్డు అందుకున్నది. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నెం.3 స్క్వాడ్రన్ కోబ్రాస్కు షిప్ట్ అయ్యారు. ఇన్ని ఘనతలు సాధించిన భావన ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో జరిగే వైమానిక దళ విన్యాసాల్లో మొట్టమొదటిసారి పాల్గొని, తొలి మహిళా యుద్ధ విమాన పైలట్ గా మరో రికార్డ్ సాధించబోతుంది.
For More News..