ఎమ్మెల్యేకు మహిళల వినతి
ఖానాపూర్, వెలుగు: తమకు బతుకమ్మ చీరలు వద్దని.. గ్రామంలోని మురుగు కాల్వలను క్లీన్చేయిస్తే చాలని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ మహిళలు డిమాండ్చేశారు. బుధవారం బతుకమ్మ చీరలు పంచేందుకు కొండుకూర్ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే రేఖానాయక్ తో స్థానిక మహిళలు డ్రైనేజీ సమస్య చెప్పుకొని వాపోయారు. కొంత కాలంగా మురుగు కాల్వలు క్లీన్చేయడం లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు మురుగు నీరు రోడ్లపై పారుతున్నా సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మురుగు కాల్వలు క్లీన్చేయించే వరకు చీరల పంపిణీ ఆపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రేఖ మహిళలకు సర్దిచెప్పి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు.