
- అయోధ్య భూమిపూజ నేపథ్యంలో
- ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం భూమి పూజ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. రాముడు అందరివాడని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె వరుసగా ట్వీట్లు చేశారు. అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంతో దేశం అంతా ఒకటి అవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. “ రాముడు అనే పదానికి అర్థం సరళత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధత, దీనబంధుడు. రాముడో అందరితో ఉన్నాడు. రాముడు, సీతాదేవి సందేశంతో, రామ్లాల ఆలయ భూమి పూజ సమాజంలో ఐక్యత, సోదరభావం కలుగజేయాలని కోరుకుంటున్నాను” అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అయోధ్యలో బుధవారం జరగనున్న భూమిపూజకు కాంగ్రెస్ పార్టీ నేతలను ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఈ ట్వీట్లు చేయడం గమనార్హం.