
తనని దూరం చేస్తుందన్న కారణంతో ఓ కాలేజీ లెక్చరర్ ని ఆమె స్నేహితుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పెట్రోల్ దాడితో ఆహాకారాలు చేసిన బాధితురాల్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 40శాతం కాలిన గాయాలతో బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
మహరాష్ట్రకు చెందిన దరోడా గ్రామానికి చెందిన వికేశ్ నాగ్రేల్, అంకిత ఇద్దరు స్నేహితులు. వికేష్ కు పెళ్లై ఇద్దరు పిల్లలున్నా కాలేజీ లెచ్చరర్ గా పనిచేస్తున్న అంకితను లైంగికంగా వేధించేవాడు. ఆందోళనకు గురైన అంకిత తన స్నేహితుడైన వికేష్ ను దూరం పెట్టింది.
దీంతో నిందితుడు తన స్నేహితురాలపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఎప్పటిలాగా తన ఇంటి నుంచి 75కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి బస్సులో బయలుదేరింది. ఉదయం 7:15 గంటల ప్రాంతంలో హింగ్రాన్ గాట్ లోని ఓ బస్టాప్ నుంచి కాలేజీకి నడుచుకుంటూ వెళుతుండగా మార్గం మధ్యలో అడ్డగించిన వికేష్..తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను బాధితురాలిపై చల్లి నిప్పంటించాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకిత 40శాతం కాలిన గాయాలతో ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.